ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలి! మంత్రి నారా లోకేశ్!
Thu May 15, 2025 20:01 Politics
రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలల్లో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "బాబు సూపర్-6', 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ'లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం," అని తెలిపారు. 11 నెలల ప్రజా ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛన్ను రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్ను రూ.6 వేలకు పెంచామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పింఛన్ ఇవ్వడం లేదని గుర్తుచేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ఉచిత గ్యాస్ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, జూన్ మాసంలో 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ' పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పాఠశాలలను మూసివేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. "ఒక్క పాఠశాలనూ మూసివేయడం లేదు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం" అని ఆయన అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేయలేని పనులను తమ ప్రభుత్వం 11 నెలల్లోనే చేసి చూపిందని, 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చామని తెలిపారు.
చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని, అనంతపురానికి రూ.22 వేల కోట్ల భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టు, విశాఖకు టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ వస్తున్నాయని, రాబోయే ఐదేళ్లలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన పార్టీలతో కూటమి పటిష్టంగా ఉందని, నామినేటెడ్ పదవుల విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని, కార్యకర్తల త్యాగాల వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!
వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!
సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్కు విజ్జప్తి చేస్తూ లేఖ!
కడప మేయర్ కు భారీ షాక్! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!
చంద్రబాబు నేతృత్వంలో పొలిట్బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #NaraLokesh #TDP #AndhraPradesh #PublicService #Leadership #OppositionSpirit #LokeshSpeech
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.